సినిమాకు వెళ్తే.. ఇల్లు గుల్ల
ఇద్దరు నిందితులు అరెస్టు .. సొత్తు స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తి
నేరేడ్మెట్, డిసెంబర్ 29 : ఘట్కేసర్లో సోమవారం రాత్రి జరిగిన దొంగతనం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితులను పట్టుకొని బంగారం, వెండి నగలతోపాటు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు. ఘట్కేసర్ బాలాజీనగర్కు చెందిన జాలిగం లింగం, కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం నారపల్లికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తీయగా దొంగలు వెనుకాల నుంచి గోడ దూకి పారిపోయారు. బీరువాలో పరిశీలించగా 28 తులాల బంగారు ఆభరణాలు, 18 తులాల వెండి నగలు, నగదు కనిపించలేదు. బాధితులు ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం ఘట్కేసర్ బస్స్టాండ్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా నిందితులు దాసరి వెంకన్న(23), మహమ్మద్ జలీల్(21) పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 28 తులాల బంగారు ఆభరణాలు, 18 తులాల వెండి నగలు, రూ.760 నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ నిందితులను పట్టుకున్న ఏసీపీ బృందాన్ని అభినందించారు. సమావేశంలో ఏసీపీలు శివకుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.