రంగారెడ్డి : రంగారెడ్డి(Rangareddy) జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ(Janwada)లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీసీ రోడ్డు(CC Road,) నిర్మాణ విషయంలో గత రెండు రోజులుగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు జన్వాడలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు. గ్రామంలో ఈ నెల 21 వరకు 144 సెక్షన్(Section 144) అమలులో ఉంటుందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు.