హైదరాబాద్: హైదరాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బులపై పోలీసులు కొరడా ఝులిపించారు. జూబ్లీహిల్స్లోని అమ్నీషియా పబ్, ఇన్సోమినియా పబ్లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాత్రి 10 గంటలు దాటినప్పటికీ పబ్బుల్లో సౌండ్ అనుమతిస్తున్నారని గుర్తించారు. దీంతో ఆయా పబ్ల యజమానులు రాజా శ్రీకర్, కునాల్, మేనేజర్ యూనిస్లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేశారు. గతంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నందుకుగాను అమ్నీషియా పబ్ను సీజ్చేశారు.