కేసు నమోదు
మారేడ్పల్లి, మే 31 : సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులోని బసేరా హోటల్, పబ్పై సోమవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 9మంది మహిళలు, 24 మంది పురుషులు, 8 మంది హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులో బసేరా హోటల్ నిర్వహిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా పబ్లో డీజే సౌండ్లతో యువతులు అశ్లీల నృత్యాలు చేస్తూ యువకులను ఆకర్షిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పబ్పై దాడిచేసి మహిళలను, పురుషులను, హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకొని గోపాలపురం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ యజమాని అమర్ ఓరీ పరారీ లోఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.