హైదరాబాద్: నగరంలో మరోసారి పెద్దమొత్తం డ్రగ్స్ పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద 70 గ్రాముల డ్రగ్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కారును సీజ్ చేశారు. మత్తుమందు విలువ రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.