మార్ఫింగ్తో బ్లాక్ మెయిలింగ్.. అరెస్టు
సిటీబ్యూరో, జూన్ 8(నమస్తే తెలంగాణ): మద్యం, సిగరేట్ అలవాటుకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఓ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్టాగ్రాంలో నకిలీ ఐడీ సృష్టించి యువతులను వేధిస్తున్నాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం… నాచారం ప్రాంతానికి చెందిన టి.గోవింద్ నారాయణ వీ-కేర్ మీడియాలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. మద్యం, సిగరేట్కు అలవాటు పడ్డాడు. వాటి కోసం తన బంధువు స్నేహితురాలైన యువతి ఇన్స్టాగ్రాం ఖాతా నుంచి ఆమె అసలు ఫొటోలను తీశాడు. వాటిని మార్ఫింగ్ చేసి నకిలీ ఐడీని సృష్టించాడు. ఆ ఖాతా ద్వారా బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డాడు. దీంతో బాధిత యువతి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బుధవారం నిందితుడు గోవింద్ నారాయణను అరెస్టు చేశారు.