ఎర్రగడ్డ, మార్చి 11: బోరబండ పీఎస్ పరిధిలో ఈనెల 8న జరిగిన 13 ఏండ్ల బాలిక అదృశ్యమైన ఘటన వెనుక ఉన్న అసలు విషయాన్ని పోలీసులు ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు.
బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం రిమాండ్కు తరలించారు.ఇదిలా ఉండగా.. బాధిత బాలిక తల్లిదండ్రులకు మద్దతుగా నిందితుడు పనిచేసే స్కూల్ వద్ద ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నా చేశారు. పాఠశాల యాజమాన్యంతో సమావేశమైన ఎమ్మార్పీఎస్ నాయకులు.. బాలిక కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.