ఘట్కేసర్ రూరల్, మే 5 : కరోనా విజృంభిస్తున్న వేళ సమాజానికి తనవంతు సాయం చేయాలనుకుంది ఆ విద్యార్థి. ఆలోచన వచ్చిందే తడువుగా ఇంట్లో వారికి విషయం చెప్పింది. వారు సరే ఒప్పుకొని తాను చేసే సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని చేతులు కలిపారు. ఇంకేముంది కొంతమంది కరోనా రోగులకైనా ఇమ్యూనిటీ బూస్టర్ను అందించాలని నిర్ణయించుకుంది ఎన్ఎఫ్సీ నగర్కు చెందిన పిట్టల ముచుకుంద(మూసీ).
మా నాన్న పిట్టల శ్రీశైలాన్ని ఆదర్శంగా తీసుకొని కష్టాల్లో ఉన్న వారికి నా వంతు సాయం చేస్తున్నా. నాన్న సహకారంతో లాక్డౌన్ సమయంలో ఎందరో కూలీల ఆకలి తీర్చా. కరోనాపై స్థానికులకు అవగాహన కల్పించడంతో పాటు ప్లాస్మా దానం చేసే వారిని గుర్తించాం. వారితో ప్లాస్మా ఇప్పించగా ఎందరో ఊపిరి పోసుకున్నారు. – పిట్టల ముచుకుంద