సుల్తాన్బజార్,జనవరి 29 : శారీరక రుగ్మతలు, వైకల్యం గాయాలతో కలిగే బాధలను నివారించడానికి ఫిజియోథెరపీ వైద్య సేవలు దోహదం చే స్తాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింగ్ కోఠి జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా ఫిజియోథెరపీ సేవలను అందిస్తూ వైద్యులు పేద ప్రజల మన్నలను పొందారు. నిత్యం 150 మంది రోగులకు సేవలను అందిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఉత్తమ వైద్యుడిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు అందుకున్న డాక్టర్ లక్ష్మీ నరసింహులు నిత్యం పేదలకు సేవ చేయడంలో నిమగ్నమయ్యారు. దవాఖానలోని ప్రధాన 13 విభాగాలలోకి 15,596 మంది రోగులు వస్తే ఒక్క ఫిజియోథెరపీ విభాగానికి మాత్రం 1303 మందికి పైగా రోగులు వస్తున్నారు.
కేంద్రాన్ని విస్తరించిన దవాఖాన పాలకవర్గం..
పదేండ్ల క్రితం దవాఖానలో ఓ గదిలో ఫిజియోథెరపీ కేంద్రం కొనసాగేది. సూపరిం టెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, ఆర్ఎంవో సాధన ప్రోత్సాహంతో నాలుగు గదులలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంకిత భావంతో విధులు నిర్వహి స్తున్న డాక్టర్ లక్ష్మీ నరసింహులు ఫిజియోథెరపీ కేంద్రానికి వచ్చే రోగుల మనసులను గెలుచుకు న్నారు. ప్రారంభంలో కేంద్రంలో ఒక లైట్ హీటర్ ఉండేదని, అన్ని రకాల రోగాలకు ఈ లైట్ హీటర్తోనే వైద్య సేవలను అందించి పంపించే వారు. సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రోత్సాహం, సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ చొరవతో ఎలక్ట్రోథెరపీలో అల్ట్రాసౌండ్, సీపీఎం, లేజర్ షాక్ వేవ్, క్రయోథెరపీ, నిమాటిక్ కంప్రెషర్, డయాథెరపీ, స్టిమి లేటర్స్, ఫిజికల్ ఎక్సర్సైజు థెరపీలో సైక్లింగ్స్, జిమ్, కాడస్టర్, స్టేబుల్స్, పుల్లీస్, కిక్ బాల్స్, మెడిసిన్ బాల్స్, బోసుబాల్, బాలెన్స్ బాల్, అన్కిల్ ఎక్సై జర్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.
పదేండ్లుగా సేవలను అందిస్తున్నా
కింగ్కోఠి జిల్లా దవాఖానలో ఫిజియోథెరపీ వైద్య సేవలను అందిస్తున్నా. సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో విభాగాన్ని విస్తరించారు. ఇన్పేషెంట్ వార్డును దవాఖానలో ఏర్పాటుచేయాలి. నూతనంగా నిర్మించిన భవనంలో కేటాయిస్తే పేద రోగులకు మెరుగైన వై ద్య సేవలు అందించవచ్చు. -డాక్టర్ ఏ లక్ష్మీ నరసింహులు