సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని బుధవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టరేట్లలో అధికారులకు టీఏటీయూ ఆటో యూనియన్ నాయకులు వినతి పత్రాలు అందించారు. ఒకటో తారీఖు వస్తుందంటే భయమేస్తుందని.. ఇంటి అద్దెలు, ఆటోల ఈఎంఐలు ఎలా చెల్లించాలో తెలియడం లేదని ఆటో డ్రైవర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సత్వరమే ప్రభుత్వం స్పందించి తమకు నెలకు రూ.15వేలు జీవనభృతిని చెల్లించాలని తెలంగాణ ఆటో మోటర్స్ అండ్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పోలె నిరంజన్ అన్నారు.