మారేడ్పల్లి : జీహెచ్ఎంసీలో 30 సంవత్సరాల నుంచి ఔట్ సోర్సింగ్ కార్మికులుగా పని చేస్తున్న వారికి ఎన్.ఎం.ఆర్లుగా గుర్తింపు నిచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ…తెలంగాణ ట్రెడ్ యూనియన్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఎం.కె.పీ గబ్బర్. చైర్మన్ బల్వంత్రెడ్డి జనరల్ సెక్రటరీ బి. బాలనర్సింహ్మలు గురువారం మారేడ్పల్లిలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్టులో ప్రస్తుతం నడుస్తున్న వాహనాలను కండిషన్ చేయించాలని మంత్రికి వివరించారు. రాంకీ సంస్థ డంపింగ్లు ఆక్రమించిన చోట జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ కార్మికులు ఉద్యోగాలు కోల్పొయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని కార్మిక సంఘాల నాయకులు మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి ఎల్లప్పుడు ఉంటుందని ఆయన వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో ప్రవీణ్ కుమార్, సంజీవ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.