బంజారాహిల్స్,ఆగస్టు 24 : జీహెచ్ఎంసీ పరిధిలో 18 ఏండ్లు నిండిన వారందరికి కోవిడ్ టీకాలు వేయించాలని లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని లోటస్ పాండ్ సమీపంలో ఉన్న ఫొటోగ్రాఫర్స్ కాలనీలో 100శాతం వాక్సినేషన్ను పూర్తి చేసిన సందర్భంగా మంగళవారం కాలనీవాసులకు ప్రశంసా పత్రాన్ని మేయర్ అందజేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 50 లక్షల మందికి పైగా వాక్సిన్లు వేయించుకున్నారన్నారు.
ఇప్పటిదాకా వాక్సిన్ వేయించుకోని వారందరిని గుర్తించడంతో పాటు వారికి టీకాలు వేయించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. అందరికీ టీకాలు వేయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. 100శాతం వాక్సినేషన్ పూర్తయిన కాలనీలు, బస్తీ సంక్షేమ సంఘాలకు ప్రశంసా పత్రాలు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎంసీ ఇస్లావత్ సేవానాయక్ తదితరులు పాల్గొన్నారు.