దుండిగల్,అక్టోబర్31: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీ పథకాలను రాష్ట్ర ప్రజలు నమ్మేస్థితిలో ప్రజలు లేరని భుత్వవిప్,ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి శంభీపూర్రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. గాజులరామారం సర్కిల్, సూరారం డివిజన్ పరిధి,షాపూర్నగర్లోని ఎంజేఎస్ ఫంక్షన్హాల్లో మంగళవారం నిర్వహించిన డివిజన్ ప్రజాఆశీర్వాదసభకు వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 70ఏండ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికల్లో ఒక్కసారి తమకు అవకాశం కల్పించాలంటూ కల్లబొల్లి కబుర్లుచెబుతూ ప్రజలను మాయమాటలతో బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.ఈ రెండుపార్టీలు తెలంగాణకు ఏం చేశారని ఓట్లకోసం వస్తున్నారని ప్రశ్నించారు. కాని సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ తొమ్మిది ఏండ్ల కాలంలో తన మేథాశక్తిని ఉపయోగించి డబ్బు ఏండ్లల్లో జరుగని అభివృద్ధిని చేసి చూపించారని స్పష్టం చేశారు.
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన బీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిద్దిక్, యువజన విభాగం అధ్యక్షులు దోడ్ల శ్రీను, నాయకులు డా.హుస్సేన్, ఫిరోజ్, మధు, అమీర్ఖాన్తో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.