దుండిగల్, డిసెంబర్ 8 : దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం బాచుపల్లి సాయినగర్లో నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపనను ఘనంగా నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే, తదితరులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కాసాని సుధాకర్ముదిరాజ్, బాలాజీ నాయక్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్యాదవ్, నాయకులు కొలన్ సునిల్రెడ్డి, వేణుయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి చౌరస్తాలో ఉన్న యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఆఫ్ బాచుపల్లి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన ‘ఐక్య క్రిస్మస్ సందడి’ వేడుకల్లో ఎమ్మెల్యే వివేకానంద్, మేయర్ నీలాగోపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనల్లో వారు పాల్గొని మాట్లాడుతూ.. క్రైస్తవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం కేసీఆర్ అన్ని మతాల పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకునేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్రాజు, కార్పొరేటర్లు విజయలక్ష్మి, ఆగం రాజు, కాసాని సుధాకర్, బాలాజీ నాయక్, కో-ఆప్షన్ సభ్యురాలు వాణి, నిజాంపేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయప్రసాద్, నాయకులు జగన్యాదవ్, మురళీయాదవ్, సతీశ్, సాంబశివారెడ్డి, దశరథ్, స్వామి, ఏసుపాదం, ఏసు పాల్, పాస్టర్లు అబ్రహం, రవిరాజు, జోసెఫ్, స్టీఫెన్ పాల్, దేవరాజు, విజయ్పాల్, జేమ్స్, జయకుమార్, శేతు, తదితరులు పాల్గొన్నారు.