మహేశ్వరం : దైవ చింతన ద్వారానే మానసిక ప్రశాంతత లబిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళ వారం మహేశ్వరంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు దేవాలయం కమిటి చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిబద్ధతకు, విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఉపవాస దీక్షలను ప్రతి హిందువు జరుపుకుంటున్నారని ఆమె అన్నారు.
మహాశివరాత్రి పండుగను తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ మహాశివుడు ఆయురారోగ్యాలతో పాటు సుఖసంతోషాలను ప్రసాదించాలని ఆమె కోరారు. అనంతరం గట్పల్లిలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఎంపీపీ రఘుమారెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, బీసీ కమీషన్ సభ్యులు ఆచారి, అందెలశ్రీరాములు యాదవ్, బొక్కనర్సింహ్మరెడ్డి ఆర్డీవో వెంకటాచారి, సర్పంచ్ కరోళ్ల ప్రియాంక రాజేష్, సహకారబ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీడీవో నర్సింలు తసీల్దార్ ఆర్పీ జ్యోతి, సీఐ మధుసూదన్ జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూనయాదయ్య ,అధికారులు పాల్గొన్నారు.