సిటీబ్యూరో, జులై 6 (నమస్తే తెలంగాణ): గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లపై రాచకొండ సీపీ మహేశ్భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. కేరళ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన మహ్మద్ అన్సర్, పీఎం హసనేయిర్లు ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి సేకరించి..వారుండే ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరిని చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేయగా, చర్లపల్లి జైల్లో ఉన్నారు. తాజాగా ఈ నిందితులపై పీడీయాక్ట్ విధించారు.