మియాపూర్, జూన్ 18: పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కాలనీలు, వీధులలో పరిశుభ్రతలో మంచి పురోగతి నెలకొంటున్నదని హైదర్నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. మిగిలిన డివిజన్లకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు తమ తోడ్పాటును అందించాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా హైదర్నగర్ డివిజన్ పరిధిలోని రామ్నరేశ్నగర్, శ్రీరామ్నగర్లలో కార్పొరేటర్ అధికారులతో కలిసి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో పరిశుభ్రత చర్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దామోదర్రెడ్డి, వెంకటేశ్ యాదవ్, శ్రీనివాస్, కృష్ణవేణి, పోతుల రాజేందర్, అధికారులు పాల్గొన్నారు.
కాలనీ డివిజన్ పరిధిలోని శంషీగూడ చెరువు వద్ద పట్టణ ప్రగతిలో కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల తోడ్పాటుతో చెరువు పరిసరాలలో చెత్త ఇతర వ్యర్థాల తొలగింపును చేపట్టారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధుల బారిన పడకుండా ఉంటామని కార్పొరేటర్ పేర్కొన్నారు. నివాస వ్యర్థాలను చెరువులో వెయవద్దని వెంకటేశ్ గౌడ్ సూచించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
డివిజన్ పరిధిలోని రామకృష్ణనగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో చెత్త, వ్యర్థాల తొలగింపును ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ప్రగతితో సమస్యల పరిష్కారం
బాలానగర్, జూన్ 18 : పట్టణ ప్రగతితో సమస్యలకు పరిష్కారం లభించిందని ఓల్డ్బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని మల్లికార్జునకాలనీలోని రోడ్ నంబర్1, రోడ్ నంబర్ 2, రోడ్ నంబర్ 3లలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన కాలనీవాసుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈ బాలకృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, సయ్యద్ ఎజాజ్, మేకల హరినాథ్, రాజు యాదవ్, పిట్ల రాజు, ఉదయ్, మట్టి శ్రీను, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.