ఎమ్మెల్యే దానం నాగేందర్
కొనసాగుతున్న పట్టణ ప్రగతి
బంజారాహిల్స్,జూన్ 13: పట్టణ ప్రగతి కార్యక్రమంతో బస్తీలు, కాలనీల్లో అభివృద్ధి పనులు మరింత వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పద్మాలయ అంబేద్కర్ నగర్, ఇందిరానగర్, జవహర్నగర్ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ పర్యటించారు. పద్మాలయ అంబేద్కర్నగర్ రోడ్డుపనులు నెలరోజులుగా నిలిచిపోయాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులను పిలిపించి పనులు నిలిచిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. పనులను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ జాప్యం చేస్తున్నారని, త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని తెలిపారు.
ఇందిరానగర్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు. పట్టణ ప్రగతితో అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత నెలకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రాష్ట్రమంతటా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రజలవద్దకు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడే పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో డీఎంసీ రజినీకాంత్రెడ్డి. జలమండలి జీఎం హరిశంకర్, టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, నగేశ్సాగర్,కృష్ణ, సింహం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ డివిజన్లో..
బంజారాహిల్స్,జూన్ 13: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని వెంకటరమణ కాలనీలో కార్పొరేటర్ విజయారెడ్డి, డీఎంసీ మోహన్రెడ్డి తదితరులు పర్యటించారు.వెంకటరమణ కాలనీలోని పార్కుకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించాలని స్థానికులు కోరారు. కాలనీలో చెట్ల కొమ్మల తొలగింపు చేపట్టాలని కోరడంతో తక్షణమే పట్టణ ప్రగతి బృందాలు అక్కడకు చేరి పనులు ప్రారంభించారు.
వెంకటేశ్వరకాలనీ డివిజన్లో..
బంజారాహిల్స్,జూన్ 13: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వరకాలనీ డివిజన్లోని గాంధీపుర బస్తీ, సంజయ్నగర్ ప్రాంతాల్లో కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి సోమవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. బస్తీలో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపును పర్యవేక్షించిన కార్పొరేటర్ మురుగు సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ ఆనంద్, జలమండలి బంజారాహిల్స్ సెక్షన్ మేనేజర్ శివ కుమార్ పాల్గొన్నారు.
గాంధీపుర బస్తీలో పర్యటిస్తూ స్థానికులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి