మల్కాజిగిరి, నవంబర్ 24: ఓటరు నమోదులో అర్హులందరూ భాగస్వాములు కావాలని ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్కుమార్ అన్నారు. గురువారం డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల బూత్స్థాయి కమిటీ స భ్యుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. బూత్ స్థాయి కమిటీల నాయకులు.. కాలనీల్లో ఓటర్ల వద్దకు వెళ్లి .. వారి పేర్ల సవరణతో పాటు ఓట రు నమోదు వివరాలను తెలపాలని అన్నారు. బూత్కు పదిమంది చొప్పున క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేస్తున్నామని అన్నారు.
నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యమూర్తి, పల్లె విజయకుమారి, కవిత, బాబు, సత్యనారాయణ, సంపత్, ఉమాపతి, నరేశ్, బ్రహ్మయ్య, రాము, వైశాలి, ఓంరాజ్, వాజిద్, కిశోర్, కృష్ణంరాజు, రవి, శంకర్, సంతోశ్, లక్ష్మి, కవి త, మాధవి, ఉమారెడ్డి, నర్సింగ్రావు, రాజు, భిక్షపతి, జ్ఞానేశ్వర్, శివకుమార్ పాల్గొన్నారు.