ఖైరతాబాద్, ఫిబ్రవరి 5 : పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును అరెస్టు చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసును తారుమారు చేసేందుకు యత్నించడంతో ఉన్నతాధికారులు అతన్ని డిసెంబర్ 26న సస్పెండ్ చేశారు. డిసెంబర్ 29 నుంచి దుర్గారావు పరారీలో ఉన్నాడు. ఇదే కేసులో నిందితుడిని తప్పించేందుకు యత్నించిన బోధన్ సీఐ ప్రేమ్కుమార్ను గత నెల 28న అరెస్టు చేశారు.
నిందితుడు రాహిల్ అమీర్కు సహకరించడంతో పాటు కేసును డైవర్ట్ చేసేందుకు ప్రేమ్ కుమార్, దుర్గారావులు నిందితుడి బంధువుల నుంచి బేరసారాలు చేసినట్లు గుర్తించారు. పోలీసు ప్రత్యేక బృందాలు ఏపీలోని గుంతకల్లు వద్ద దుర్గారావును అరెస్టు చేసి వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.