ఇంటికి వెళ్లి ప్రమాణం చేయించిన కలెక్టర్ ఎల్.శర్మన్
సిటీబ్యూరో, జూన్ 18(నమస్తే తెలంగాణ): పాకిస్తాన్కు చెందిన మహ్మదీ బేగం శనివారం భారత పౌరసత్వం పొందింది. ఇండియన్ సిటిజన్ షిప్ యూ/ఎస్ 5(1)(ఎఫ్) కింద దరఖాస్తు చేసుకోవడంతో తనిఖీలు పూర్తి చేశారు.
అనంతరం, జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఆధ్వర్యంలో పాకిస్తాన్కు చెందిన మహిళ ఇంటికి వెళ్లి భారత పౌరసత్వం తీసుకుంటున్నట్లు ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, ఆమె లేవలేని పరిస్థితిలో బెడ్ సిక్గా ఉండటంతో ఆమె కలెక్టరేట్కు రాలేక పోయిందని, అందువల్లే జిల్లా కలెక్టర్ స్వయంగా టోలిచౌకి – జానకీనగర్లో ఉన్న తన నివాసానికి వెళ్లి ప్రమాణం చేయించినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు.