కాచిగూడ,జూలై 19 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని పెయింటర్ మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం.. తలబ్కట్ట ప్రాంతానికి చెందిన యూసుఫ్ కుమారుడు మహ్మద్ ఫరూక్(48)వృత్తి రీత్యా పెయింటర్.
సోమవారం రాత్రి ఉప్పుగూడ-యాకత్పుర రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఫరూక్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.