సికింద్రాబాద్, డిసెంబర్11 : సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన పద్మారావుగౌడ్ మొదటి సారి సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు.నాయకులు ,కార్యకర్తలు,అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా పద్మారావుకు పూలమాలలు వేసి స్వాగతించారు. నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పద్మారావును కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిరంతరం తాను ప్రజలకు అందుబాటులో ఉండి తన వంతు సేవలు అందించానన్నారు. అదేవిధంగా సీతాఫల్మండిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజా సమస్యలను పరిషరించేందుకు శ్రమించానని, అందుకే ప్రజలు తనను ఆదరించారన్నారు.
ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారిగా పద్మారావు గౌడ్ సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు.సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా తనకు కల్పించిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ లతో పాటు యువ నేత రామేశ్వర్ గౌడ్, కరాటే రాజు,గరికపాటి చంద్రశేఖర్,మల్లూరి అనిల్,బెజ్జంకి రాజేష్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.