బేగంపేట, మే 15 : కరోనా సోకి ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడుతున్న వారికి ఊపిరిని అందించేందుకు ఉచితంగా ఆక్సిజన్ యంత్రాలను పంపిణీ చేస్తున్నట్లు హర్యానా నాగరిక్ సంఘ్ ప్రతినిధులు తెలిపారు. శనివారం సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని హర్యానా భవన్లో సంఘ్ అధ్యక్షుడు అంజనీకుమార్ అగర్వాల్ మాట్లాడుతూ తమ వద్ద 50 ఆక్సిజన్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, వారం రోజులపాటు కరోనా రోగులకు ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. వినియోగించుకున్న అనంతరం తిరిగి ఇస్తే మరొకరికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. సంఘ్ సభ్యులైన పదిమంది వైద్య నిపుణులు, సాధారణ వైద్యులు ఫోన్ లేదా ఆన్లైన్లో కరోనా రోగులకు ఉచితంగా 24 గంటలు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆక్సిజన్ యంత్రాలు కావాల్సిన వారు సికింద్రాబాద్ హర్యానా భవన్లో లేదా 9849013090 సంప్రదించాలన్నారు.