ఉప్పల్, జనవరి 5 : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం ఉప్పల్ డివిజన్లోని విజయపురికాలనీలో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పలు సమస్యల ను కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను పరిష్కరించేవిధంగా చర్య లు చేపట్టాలన్నారు. కాలనీలు, బస్తీలలో ఎలాంటి సమ స్యలు ఉన్నా.. వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ రజితాపరమేశ్వర్రెడ్డి, ఈఈ నాగేందర్, డీఈ నిఖిల్రెడ్డి, ఏఈ వసంత, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, సంతోష్రెడ్డి, నరసింహారెడ్డి, సుధాకర్, వీరేశ్, రాజు, యాదగిరి రెడ్డి, వంశీ ముదిరాజ్ పాల్గొన్నారు.