హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓయూలోకి రాహుల్ గాంధీని అనుమతించబోమని స్పష్టం చేస్తూ.. ఆర్ట్స్ కాలేజీ ఎదుట జగ్గారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని వెక్కిరించిన ఊసరవెల్లి జగ్గారెడ్డిని ఓయూలో అడుగుపెట్టనివ్వమని, ఆయన గుడ్డలు ఊడదీస్తామని హెచ్చరించారు.
తెలంగాణ యువతను చంపిన జగ్గారెడ్డి ఓ నరహంతకుడు అని కోపోద్రిక్తులయ్యారు. వసూల్ రాజాలను వెనుకేసుకొని ఉద్యమ శక్తులపై మొరగడం సరికాదని ధ్వజమెత్తారు. తెలంగాణ యువకుల నెత్తురు తాగిన నికృష్టులు కాంగ్రెస్ నాయకులని విరుచుకుపడ్డారు. దేశమే ఛీకొట్టిన రాహుల్ గాంధీకి ఓయూలో ఏం పని ప్రశ్నించారు.
టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు, విద్యార్థి నాయకులు బండారి వీరబాబు, ఆవాలహరి బాబు, జీడి అనిల్, పెదమ్మ రమేష్, కోతి విజయ్, శిగ వెంకట్, రఘురాం, శషిపాల్, రాజేష్, జంగయ్య, వినోద్, రమేష్, రామకృష్ణ, బాలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.