సుల్తాన్బజార్,ఆగస్టు 7 : వైద్య వృత్తిలోని ప్రతి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సులు నేటి తరం యువ పీజీలకు ఉపయోగపడుతాయని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ శశికళా రెడ్డి అన్నారు. శనివారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్, ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో 6వ తెలంగాణ ఆర్థో పెడిక్ సర్జన్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్(టోస్కాన్) 2021 అంతర్జాతీయ వర్చువల్ సదస్సు నిర్వహించారు. రెండవ రోజు నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు.
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ..కొవిడ్ విపత్కర సమయంలో ఆన్లైన్ అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం ద్వారా యువ పీజీలు, సర్జన్లు మరింత మెళుకువలను నేర్చుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్ జీవీఎస్ మూర్తి, సదస్సు కార్యదర్శి డాక్టర్ వై.తిమ్మారెడ్డి, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సుధీర్ కుమార్, కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ ఎన్వీ ప్రసాద్, డాక్టర్ ఎంవీ రెడ్డి, డాక్టర్ కృష్ణ, డాక్టర్ శేఖర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రభుదీర్, డాక్టర్ వీరా రెడ్డి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ అబ్బాస్ పాల్గొన్నారు.