సుల్తాన్బజార్, సెప్టెంబర్ 2: ఉస్మానియా దవాఖానకు సన్ ఫార్మా న్యూరో సైక్రియాట్రిక్ సంస్థ ప్రతినిధులు గురువారం 189 ఇంచుల ఎల్ఈడీ టీవీని విరాళంగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.నాగేందర్ మాట్లాడుతూ.. సన్ ఫార్మా న్యూరో సైక్రియాట్రిక్ సంస్థ ప్రతినిధులు న్యూరో సర్జరీ విభాగం విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చే విధంగా అత్యాధునిక రూ. రెండు లక్షల విలువజేసే ఎల్ఈడీ టీవీని విరాళంగా ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సీఎస్ ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు, డాక్టర్ రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.