సిటీ బ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో నేటి నుంచి 22 విభాగాల ఓపీ సేవలు ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈమేరకు దవాఖానలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్, డయాగ్నోసిస్ సేవలు అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటిరాలజీ, యారాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతో పాటు 22 విభాగాల్లో ట్రయల్ రన్ జరగనుంది. అవసరమైన డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని అధికారులు నియమించారు.