హైదరాబాద్: నగరంలోని అమీర్పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమీర్పేటలోని మైత్రివనం చౌరస్తా వద్ద మోటారు సైకిల్ను ఓ వ్యాను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుడిని మహేశ్గా గుర్తించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో అమీర్పేటలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి, ట్రాఫిక్ను క్లియర్ చేశారు.