హైదరాబాద్: నగరంలోని అప్పా జంక్షన్ (Appa junction) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది (Road accident). శుక్రవారం తెల్లవారుజామున మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు అప్పా జంక్షన్ వద్ద అదుపుతప్పి డివైడర్ అవతలివైపు దూసుకెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ట్రైవర్ అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తలరించారు. మృతుడిని ఉపేందర్గా గుర్తించారు.
గాయపడిన అరవింద్, ప్రకాశ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, ప్రమాదం కారణంగా అప్పా జంక్షన్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మితిమీరిన వేగమే (Over speed) ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.