Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని చందానగర్ పోలీసు స్టేషన్( Chanda Nagar PS ) పరిధిలో విషాదం నెలకొంది. తారానగర్లో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఇంట్లో ఆడుకుంటూ.. పొరపాటున మస్కిటో లిక్విడ్ తాగి మృతి చెందాడు.
ఇంట్లో ఆడుకుంటున్న బాలుడు తన పక్కనే ఉన్న మస్కిటో లిక్విడ్( Mosquito Liquid ) బాటిల్ను తీసుకున్నాడు. పొరపాటున ఆ లిక్విడ్ను తాగేశాడు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన తల్లిదండ్రులు బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని అబ్బూ జాకీర్గా పోలీసులు గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.