అమీర్పేట్, సెప్టెంబర్ 23 : మానేపల్లి జువెల్లర్స్ స్టోర్ను ఈనెల 28న పంజాగుట్టలో ప్రారంభిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డైరెక్టర్లు మానేపల్లి మురళీకృష్ణ, మానేపల్లి గోపీకృష్ణ శుక్రవారం అమీర్పేట్లోని హోటల్ మారీగోల్డ్లో జరిగిన జువెల్లరీ ప్రదర్శనలో వెల్లడించారు. నటీమణులు స్రవంతి చొక్కారపు, ప్రీతిసింగ్ సహా పలువురు మోడళ్లు పాల్గొని పలురకాల నగలు ధరించి ప్రదర్శించారు.
ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మానేపల్లి జువెల్లరీ డైరెక్టర్లు మాట్లాడుతూ.. పంజాగుట్టలో 28న ప్రారంభమయ్యే మానేపల్లి జువెల్లర్స్ స్టోర్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ జువెల్లరీకి ప్రత్యేకమని తెలిపారు. జువెల్లరీ అమ్మకాల్లో కస్టమర్ల నమ్మకం, అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అరుదైన జువెల్లరీ డిజైన్లు తమ నూతన స్టోర్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. తమ స్టోర్లలో 100 శాతం బీఐఎస్ హాల్మార్క్తో కూడిన బంగారు వస్తువులు, 100 శాతం ఐజీఐ సర్టిఫికేషన్తో అంతర్జాతీయంగా ధ్రువీకరించబడిన డైమెండ్ కలెక్షన్స్ ఉంటాయని తెలిపారు.