హైదరాబాద్ : అంబర్పేట(Amberpet) ఔషధ గోదాముల్లో(Drug warehouses) అధికారులు శుక్రవారం తనిఖీలు(Officials inspect) చేపట్టారు. కొన్ని నకిలీ మందులను గుర్తించిన ఔషధ నియంత్రణ అధికారులు బిల్లులు లేని మందులను స్వాధీనం చేసుకున్నారు. గోదాముల నుంచి రూ.20.52 లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. బషీర్ అనే వ్యక్తి అనుమతి లేకుండా దుకాణాలకు ఔషధాలు సరఫరా చేస్తున్నాడు. ఢిల్లీలోని ఆష్లే ఫర్మాలో తయారైన మందులను అంబర్పేటలో విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలినట్లు సమాచారం.