వాష్ రూమ్లో మహిళా సిబ్బంది ఫొటోలు తీసిన ఆఫీస్ బాయ్
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
ఖైరతాబాద్, మే 26 : బంజారాహిల్స్లోని ఓ బొటిక్లో దారుణం చోటు చేసుకుంది. అందులో పనిచేసే ఆఫీస్ బాయ్ వాష్ రూమ్లో కెమెరా పెట్టి మహిళా సిబ్బంది ఫొటోలు తీసి వారికే మెసేజ్లు పంపించాడు. ఆలస్యంగా గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. రోడ్ నం.92లోని ఆర్యన్స్ బిల్డింగ్లో కొంత కాలంగా అనోనిమ్ బొటిక్ నిర్వహిస్తున్నారు. బొటిక్లో పనిచేసిన మానివేసిన ఓ మహిళకు ఫిబ్రవరి 24న అసభ్యకరమైన మెసేజ్ గుర్తుతెలియని నంబర్ నుంచి వచ్చింది. ఆమె ఆ మెసేజ్ను డిలీట్ చేసింది.
ఈనెల 20న అదే నంబర్ నుంచి ఓ లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసి చూడగా, అందులో ఆమె నగ్న ఫొటోలు కనిపించాయి. దీంతో భయబ్రాంతులకు గురైన ఆమె ఆ నంబర్ను ఆరా తీయగా, బొటిక్లో పనిచేసే ఆఫీస్ బాయ్ మిథున్ దాస్దిగా గుర్తించింది. బొటిక్లో పనిచేసే మరికొంత మంది మహిళా సిబ్బంది ఫొటోలను సైతం అతడు తీసినట్లు తెలుసుకుంది. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.