సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిత్యానంద త్రయోదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బంజారాహిల్స్లోని హరేకృష్ణ స్వర్ణదేవాలయంలో హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌరచంద్ర దాస ప్రభూజీ ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలను కనుల పండువగా నిర్వహించారు.
కృష్ణ భగవానుడికి పంచామృతం, పంచగవ్యం, సుగంధ ద్రవ్యాలతో 108 కలశాల అష్టోత్తర కలశ మహాభిషేకం, భక్తుల సంకీర్తనల మధ్య మహాహారతి నిర్వహించారు. స్వామివారికి హరినామ సంకీర్తన, ప్రవచనాలతో పాటు 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు.