శంషాబాద్ రూరల్, డిసెంబర్ 8 : నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగోసారి విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్కు శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన నివాసానికి చేరుకొని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. వరుసగా నాలుగోసారి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ యూత్ జిల్లా మాజీ కార్యదర్శి రాచమల్ల సురేశ్ ఆధ్వర్యంలో పలువురు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకుడు విశ్వనాథం పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తా
మణికొండ, డిసెంబర్ 8 : మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. నియోజకవర్గంలో 4వ సారి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన ప్రకాశ్గౌడ్ను రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షురాలు లక్ష్మీశ్రీ ఆధ్వర్యంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యూష ఫౌండేషన్ చైర్పర్సన్ సరోజిని, మహిళా నాయకురాళ్లు నాగలక్ష్మి, స్వప్న, శీలా, స్పందన పాల్గొన్నారు.
ఎన్నికల్లో గెలుపొందడంతో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ను శుక్రవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్గౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్ గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు మల్లేశ్ యాదవ్, నాయకులు పాపయ్య యాదవ్, రాము యాదవ్, డిన్ను, రాజు నాయక్, నరసింహ గౌడ్, రాజు పాల్గొన్నారు.