మల్కాజిగిరి, నవంబర్ 9: పిల్లలు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన ఆరోగ్యం కోసం ప్రభుత్వం నెలనెలా పోషకాహారం అందిస్తున్నది. పోషకాహార లోపాలు రాకుం డా పసి పిల్లలకు ‘బాలామృతం’, గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాలను అందజే స్తూ.. వారికి ఆరోగ్యంపై భరోసా కల్పిస్తున్నది. అల్వాల్లోని ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీం(ఐసీడీఎస్)ద్వారా అల్వాల్, మల్కాజిగిరి, ఉప్పల్, మేడిపల్లి, కాప్రా, ఘట్కేసర్ మండలాల్లోని 269 అంగర్వాడీ కేంద్రాల ద్వారా 46,203 మంది పిల్లలు, 6,178 మంది గర్భిణులు, 4,588మంది బాలింతలు ..మొత్తం 56,969మంది లబ్ధి పొందుతున్నారు.
పిల్లలకు ‘బాలామృతం’..
పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు క్రమం తప్పకుండా ఇవ్వాలి.. ఏడో నెల నుంచి రెండేళ్ల వరకు తల్లి పాలతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారా న్ని అందించాలి. ఇందు కోసం ప్రభుత్వం పిల్లలకు ‘బాలామృతం’, గర్భిణులకు ఇండ్ల వద్ద గుడ్లను అందజేస్తుంది. రెండేళ్ల వరకు పాలు పడితే తల్లికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాగే తల్లిపాలవల్ల పిల్లలు మానసికంగా, శారీ రకంగా ఆరోగ్యకరంగా ఉంటారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు కాలనీల్లో సర్వేచేసి గర్భిణులను గుర్తించి.. వారికి పోషకాహారాల గురించి అవ గాహన కల్పిస్తున్నారు. 6నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు నెలకు రెండున్నర కిలోల చొప్పున పోషకాహారాలతో కూడిన ‘బాలామృతం’ అందజేస్తున్నారు.
మరికొన్ని అంగన్వాడీ కేంద్రాలు..
మల్కాజిగిరి నియోజకవర్గంలో మరికొన్ని అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడు తున్నాం. పోషకాహార లోపాలవల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని.. మంచి ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. – మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే
మెరుగైన ఆరోగ్యానికి పోషకాహారం..
పిల్లలు, గర్భిణులు, బాలింతల మెరుగైన ఆరోగ్యానికి పోషకాహారం అందజేస్తున్నాం. బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తున్నాం. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బందితో కలసి ఇంటింటికీ తిరిగి అవగాహన నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవాలు నిర్వహించుకోవాలని గర్భిణులకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నాం. ప్రస్తుతం 46,203మంది పిల్లలు, 6,178 గర్భిణులు, 4,588బాలింతలు మొత్తం 56,969మంది లబ్ధిదారులకు పోషకాహారం అందజేస్తున్నాం. వారి నుంచి మంచి స్పందన రావడం హర్షణీయం.