దుండిగల్, మే 24 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్పల్లి చౌరస్తాలో ఎన్టీ రామారావు శతజయంతిని పురస్కరించుకొని అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వారు ముఖ్యఅతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన జీవితం సాగిందన్నారు. తెలుగు సినిమాలలో ఆయన వేసిన పాత్రల ప్రభావం ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. రాజకీయ చైతన్యం, రాజకీయంలో నాయకులు ఎలా నడచుకోవాలని చూపించిన మహనీయుడు అని కొనియాడారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కృష్ణారావు, ఆర్గనైజేషన్కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ, వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్ భరత్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్రావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ట కమిటీ అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్, మాజీ కౌన్సిలర్ రంగారావు, బాబి, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.