ముషీరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ సిద్దాంతాలను దశాబ్దాలుగా విదేశాల్లో ప్రచారం చేస్తున్న డాక్టర్ శ్రీరామ్ శొంఠిని 2021 ఎన్ఆర్ఐ సోషల్ సర్వీస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు అంతార్జతీయ తెలుగు సంఘం ఇట్క్లా అధ్యక్షుడు, చైర్మన్ డాక్టర్ కె.ధర్మారావు, లయన్ విజయ్కుమార్లు ఒక ప్రకటనలో తెలిపారు. 75వ భారత స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14న ఎన్ఆర్ఐ సోషల్ సర్వీస్ అవార్డును విజయిభవ ఆన్లైన్ ఛానల్ ద్వారా బహుకరించనున్నట్లు పేర్కొన్నారు.
డాక్టర్ శ్రీరామ్ శొంఠి అమెరికాలో నివసిస్తూ మహాత్ముని సిద్దాంతాలను దశాబ్దాలుగా వివిధ దేశాలలో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్సాస్ లోని గాంధీ మొమోరియల్ చైర్మన్ ప్రసాద్ తోటకూర, ఇండో అమెరికా స్నేహ మండలి డల్లాస్ ఉపాధ్యక్షుడు శ్రీరావు, సినీ నిర్మాత రామ సత్యనారయణ తదితరులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.