బంజారాహిల్స్,జూలై 1: డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీతో పాటు పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలయిందని యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
బీఏ, బీకామ్,బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు, ఎంఏ. ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ తదితర పీజీ కోర్సులు, బీఎల్ఐఎస్సీ. ఎమ్ఎల్ఐసీ లాంటి పీజీ డిప్లొమా కోర్సులతో పాటు పలు సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశానికి సంబందించిన వివరాలను www.braouonline.in వెబ్సైట్లో పొందవచ్చని పేర్కొన్నారు.
దీంతో పాటు 2021-22 విద్యాసంవత్సరం మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు రెండో సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించాలని, ఇతర విద్యార్థులు కూడా జూలై 31లోగా ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాలని కోరారు.