సిటీబ్యూరో, మార్చి 27(నమస్తే తెలంగాణ) : నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్సీడీ)పై చార్మినార్ జోన్ పరిధిలో డీఎంహెచ్ఓ సమీక్ష నిర్వహించారు. బుధవారం రివ్యూ మీటింగ్ ఎన్సీడీ ప్రోగ్రాం ద్వారా సూరజ్భన్, జంగంమెట్ క్లస్టర్ పరిధిలో జరిగిన సమావేశంలో డా. సునంద ఎస్పీహెచ్ఓ, బస్తీ దవాఖాన వైద్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీడీ స్క్రీనింగ్ గురించి వివరించారు.
ప్రతి రోజు 25 మందికి స్క్రీనింగ్ చేయాలని, ఔట్ పేషంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. టెలి మెడిసిన్ విధానాన్ని విస్తృతంగా వినియోగించాలని సూచించారు. వైద్యులు వంద శాతం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ స్పష్టం చేశారు.