ఇది కుటుంబ సభ్యులకు ప్రయోజనం: ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) పోర్టల్లో ఈ- నామినేషన్ నమోదు చేసుకోవటం ఉద్యోగి కుటుంబానికి ఎంతో ప్రయోజనకరమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈపీఎఫ్ నామినేషన్పై ఉద్యోగుల్లో అవగాహన పెరగాలని అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని బస్భవన్లో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులంతా ఈ- నామినేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు.
ఈపీఎఫ్ కమిషనర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. నామినీ వివరాలు నమోదు చేస్తే ఉద్యోగికి ఏమైనా జరిగితే నామినీ ఈపీఎఫ్ నగదును డ్రా చేసుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఈపీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్తోపాటు అధికారులు విజయ పుష్ప, జీ యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.