సిటీబ్యూరో, మార్చి 2(నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో జరిగేందు కు తనిఖీ బృందాలు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఈవీడీఎం డైరెక్టర్, ఎన్నికల జిల్లా నోడల్ అధికారి ప్రకాష్ రెడ్డి అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం తనిఖీ బృందాలను సం సిద్ధం చేసేందు కు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా నోడల్ అధికారులు ఈవీడీఎం డైరెక్టర్, ఎన్నికల వ్యయ పరిశీలకులు శరత్ చంద్ర ఈ బృం దాలకు వ్యవహరించాల్సిన తీరును వివరించా రు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి బాధ్యతలు నిర్వహించాలని, నియమ నిబంధనల పాటించాల్సిన విషయాలపై వివరించారు. లేని పక్షంలో ఎన్నికల నిబంధనలు మేరకు క్రమ శిక్షణ చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. తనిఖీ అధికారులు నగదు అక్రమ తరలింపు నివారణ, ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ప్రశాంతంగా తమ ఓటు హకును వినియోగించుకునే విధంగా చేయడం వారి బాధ్యతలను వివరించారు.
ఎఫ్ఎస్టి బృందాలు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ నుంచి విధులు నిర్వహిస్తాయని, ఎస్ఎస్టీ బృందాలు నామినేషన్ ప్రక్రియ నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుందని ప్రకాష్రెడ్డి తెలిపారు. పట్టుకున్న సొమ్ము ఎన్నికల నియమావళి ప్రకారంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ఆధారాలను గుర్తించి వీడియో గ్రాఫ్ చేయాలన్నారు. సీ-విజిల్కు వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించి 100 నిమిషాలలో పూర్తి పరిషారం చేయాల్సి ఉంటుందన్నారు.