బండ్లగూడ, ఫిబ్రవరి 22: నూతనంగా శిక్షణ పొందే కానిస్టేబుళ్లు తెలంగాణలో సైబర్క్రైమ్ను అరికట్టడంలో తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. నూతనంగా ఎంపికైన 685 మంది కానిస్టేబుళ్లకు గురువారం తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, నేరస్తులతో కఠినంగా వ్యవహరించాలన్నారు.
శిక్షణ కాలంలో కానిస్టేబుళ్లు ఎవరు కూడా ఇబ్బందికి గురికావద్దని, ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, రమేశ్ రెడ్డి, ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్ నర్మద, రాఘవరావు, టీఎస్పీఎ ఓఎస్డీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.