Akkanna Madanna Temple | చార్మినార్, జూన్ 2: చారిత్రక శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ సర్వసభ్య సమావేశం వివిధ కార్యవర్గ సభ్యులతో కలిసి అక్కన్న మాదన్న ప్రార్థన మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా దేవరశెట్టి ప్రభాకర్ రావును సర్వ సభ్యులు ఎన్నుకున్నారు. ఆలయ ప్యాట్రాన్ గా జి.నిరంజన్, సలహాదారులుగా జి.రాజారత్నం, డాక్టర్ ఏ.భారత్ ప్రకాశ్, రాందేవ్ అగర్వాల్, ఉపాధ్యక్షులుగా జగ్మోహన్ కపూర్, ఏం.కృష్ణ, ఏం.వినోద్, కార్యదర్శిగా కె.దత్తాత్రేయ, కోశాధికారిగా ఏ.సతీష్ కుమార్, సంయుక్త కార్యదర్శులుగా చేతన్ కుమార్ సూరి, ఏం.విజయ్ కుమార్, జోగేందర్ సింగ్, జి.శ్రీనివాస్, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్.పి.క్రాంతి కుమార్. కార్యవర్గ సభ్యులుగా జి.రాజు, ఏ.గోపాల్, బసవరాజు, జి.కన్నయ్య లాల్, జి.దినేష్, లోకేష్ సుగంధి, రామ్ సింగ్ ఠాకూర్, ఏం. ముకేష్ యాదవ్, టి.రమేష్ బాబును ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆషాఢ మాస వార్షిక బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు జి.రాఘవేందర్ తో కలసి భోనాలా వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.