మెట్రో స్టేషన్లు ప్రయాణానికే కాదు..ఆట విడుపు కేంద్రాలుగానూ మారుతున్నాయి. కారిడార్-3(నాగోల్-రాయదుర్గం)లోని అమీర్పేట ఇంటర్చేంజ్ తర్వాత వచ్చే మధురానగర్ స్టేషన్(తరుణి)లో నెట్ క్రికెట్ వేదికను ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తు (కాన్కోర్ లెవల్)లో టికెట్ కౌంటర్లతో పాటు షాపింగ్ కోసం రెండు వైపులా ప్రత్యేకంగా ఉన్న స్థలాన్ని వివిధ అవసరాలకు అందుబాటులో ఉంచారు.
చాలా రోజులుగా ఖాళీగా ఉంటున్న ఈ స్థలాన్ని నెట్ క్రికెట్ కోసం అద్దెకిచ్చారు. దీంతో ఎంచక్కా..పెద్దలతో పాటు పిల్లలు సైతం క్రికెట్లో రాటుదేలుతున్నారు. స్థలం కిరాయికి ఇవ్వడం ద్వారా ఎల్ అండ్ టీ మెట్రో సంస్థకు ఆదాయమూ వస్తోంది.
-సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ)