చార్మినార్, అక్టోబర్ 16: నెహ్రూ జులాజికల్ పార్క్ను దేశంలోనే అత్యున్నత జూగా మార్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని జూ పార్క్ నూతన క్యూరేటర్ రాజశేఖర్ తెలిపారు. జూ పార్క్ క్యూరేటర్గా బాధ్యతలు నిర్వహించిన సుభద్రాదేవి రాష్ట్ర ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. అటవీ శాఖలో వివిధ హోదాల్లో బాధ్యతలను నిర్వహించిన ఎస్.రాజశేఖర్ను జూ పార్క్ క్యూరేటర్గా నియమించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, నగరంలోని జూ పార్క్ను దేశంలోని ఇతర జూ పార్క్ల కంటే భిన్నంగా తీర్చిదిద్దుతూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.