కాచిగూడ : మహిళలతోనే దేశాభివృద్ధి జరుగుతుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మొదటిరోజు ఆదివారం ’’మహిళా బంధు’’ పేరిట కాచిగూడ టీఆర్ఎస్ కార్యాలయం వద్ద మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పారిశుద్ధ్య కార్మికులు, అశావర్కర్లలను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మహిళా సాధికారిత అవగాహన బాల్యం నుంచే జరపాలని, మహిళలు చట్ట సభల్లో రాణించినప్పుడే మహిళలకు సరైన న్యాయం జరుగుతుందని, ఆ దిశగా మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. సమాజంలో మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అన్ని రంగాలలో దేశం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర భీష్మాదేవ్,ఓం ప్రకాశ్యాదవ్, ప్రధాన కార్యదర్శి సదానంద్,బి.కృష్ణాగౌడ్, విజితారెడ్డి,బబ్లూ, అంటోని తదితరులు పాల్గొన్నారు.