బంజారాహిల్స్, మే 22 : బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని స్వయం భూ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీ నరసింహ జయంతి సందర్భంగా బుధవారం స్వామి వారి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. అంతకుముందు మూలవిరాట్కు అభిషేకం చేసి.. శ్రీ నరసింహ హోమం నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం, సాయంత్రం ఉత్సవ మూర్తికి 108 కలశాలతో మహా అభిషేకం చేశారు. కార్యక్రమంలో హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు సత్యచంద్ర గౌరదాసతో పాటు నగరం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.